
- తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులది కీలక పాత్ర
- హై బిజ్ టీవీ అవార్డుల ప్రదానంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్/మాదాపూర్,వెలుగు:సమాజంలో మీడియా పాత్ర చాలా గొప్పదని ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. మంగళవారం మాదాపూర్హెచ్ఐసీసీ నోవాటెల్ హోటల్ లో జరిగిన ‘హైబిజ్ టీవీ మీడియా అవార్డ్స్’ ఐదో ఎడిషన్ కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలోని వాస్తవికతను ప్రపంచానికి తెలియజేసేందుకు జర్నలిస్టులు అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఎన్నో అడ్డంకులను దాటుకుని వార్తలను ప్రజల ముందు ఉంచుతున్నారని తెలిపారు.
నిజాన్ని తెలియజేసేందుకు జర్నలిస్టులు ఎన్నో త్యాగాలు చేస్తున్నారని మంత్రి కొనియాడారు. రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం, పాత్రికేయులు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం దేవులపల్లి అమర్, షేక్ సుభానీ, జగదీశ్కు లెజెండరీ అవార్డులు, లక్ష్మీరావు, శ్రీధర్కు విజనరీ అవార్డులు అందజేశారు. ప్రింట్అండ్ఎలక్ట్రానిక్ మీడియాతోపాటు రేడియో కేటగిరిలో 60 మందికి అవార్డులు ప్రదానం చేశారు.
డ్వర్టైజ్మెంట్ విభాగంలో వీ6వెలుగు అడ్వర్టైజ్మెంట్ సీజీఎం సంతోశ్, సీనియర్ మేనేజర్ ప్రేమ్కుమార్రెడ్డి, డీజీఎంలు గణపతిరావు, శ్రీనివాస్, అసిస్టెంట్మేనేజర్ రాకేశ్, వీ6 ఏడీవీటీ సేల్స్ మేనేజర్ రజా, విద్యారంగంలో ఉత్తమ రిపోర్టర్గా వీ6 నుంచి విజయ్శర్మ మంత్రి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. ఎమ్మెల్సీ అమీర్అలీఖాన్, భారతి సిమెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ ఎం.రవీందర్ రెడ్డి, క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ వి.రాజశేఖర్ రెడ్డి, హైబిజ్ టీవీ ఎండీ ఎం.రాజ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.