టీమిండియా హెడ్ కోచ్గా రవిశాస్త్రిని తొలగించే ప్రయత్నాలు చేస్తోంది బీసీసీఐ. ఆయన స్థానంలో హెడ్ కోచ్ బాధ్యతలను రాహుల్ ద్రవిడ్కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. రవిశాస్త్రి కోచ్గా పనిచేస్తున్నప్పటి నుంచి భారత్ అనేక విదేశీ సిరీస్లలో విజయం సాధించింది. అయితే ICC టోర్నీల్లో సత్తా చాటలేకపోయింది. ఇక రవిశాస్త్రి పదవీ కాలం కూడా ముగియనుంది. దీంతో ఇకపై శాస్త్రికి కాకుండా కోచ్ పదవిని ద్రవిడ్కు అప్పగించాలని BCCI ఆలోచిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు ద్రవిడ్ ఆధ్వర్యంలో భారత అండర్ 19 క్రికెట్ జట్లు వరల్డ్ కప్ మ్యాచ్లలో సత్తా చాటాయి. 2016 జరిగిన అండర్ 19 వరల్డ్ కప్లో భారత జట్టు రన్నరప్ గా నిలవగా, 2018లో ఏకంగా విజేతగా నిలిచింది. దీంతో ద్రవిడ్ 2019 జూలై 8 నుంచి బెంగళూరులోని NCAకు హెడ్గా కొనసాగుతున్నాడు. అయితే ఆ పదవీ కాలం రెండేళ్లు. ఇప్పటికే ముగిసింది. దీంతో NCAకు హెడ్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అయితే మరోసారి NCA హెడ్గా పనిచేయాలంటే ద్రవిడ్ మళ్లీ దరఖాస్తు చేయాలి. కానీ అలా జరగకపోవచ్చని తెలుస్తోంది. ఇటీవల శ్రీలంక వెళ్లిన టీమిండియా జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్గా వ్యవహరించాడు.