ఉత్తరప్రదేశ్లో మహిళలపై నేరాలు విపరీతంగా పెరిగిపోతుండటంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ఆగ్రహం వ్యక్తంచేశారు. యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై దాడులు జరగడం కొత్తేమీ కాదన్నారు. అయితే మహిళలపై వరుసగా లైంగిక దాడులు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. యూపీలో తరచూ చోటుచేసుకుంటున్న దారుణాలను చూస్తుంటే అసలు అక్కడ ఒక ప్రభుత్వం, ప్రభుత్వ వ్యవస్థ అనేది ఉందా.. ఉంటే అది సక్రమంగా పనిచేస్తుందా అనే అనుమానం కలుగుతోందన్నారు ఆజాద్.