సత్యదేవ్, కన్నడ స్టార్ డాలీ ధనుంజయ్ హీరోలుగా ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘జీబ్రా’. లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అనేది ట్యాగ్ లైన్. ప్రియా భవాని శంకర్, జెన్నిఫర్ పిచినాటో హీరోయిన్స్. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా సత్యదేవ్, డాలీ ధనుంజయ్తో పాటు టీమ్ అంతా కేక్ కట్ చేసి వ్రాప్ అప్ పార్టీని సెలబ్రేట్ చేసుకున్న ఫొటోను మేకర్స్ విడుదల చేశారు. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసి రిలీజ్ డేట్ను అనౌన్స్ చేస్తామన్నారు.
‘రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా, ఆర్థిక నేరాల నేపథ్యంలో క్రైమ్ యాక్షన్ ఎంటర్ టైనర్గా రూపొందిస్తున్నాం. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ హైలైట్ అవుతుంది’ అని దర్శకనిర్మాతలు తెలియజేశారు. సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో సునీల్, గరుడ రామచంద్రరాజు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్.ఎన్ రెడ్డి, బాల సుందరం, దినేష్ సుందరం కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది.