సిద్ధార్థ్ రాయ్‌‌‌‌ మూవీ ఫిబ్రవరి 23న విడుదల

సిద్ధార్థ్ రాయ్‌‌‌‌ మూవీ ఫిబ్రవరి 23న విడుదల

దీపక్ సరోజ్, తన్వి నేగి జంటగా వి యశస్వీ రూపొందించిన చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్‌‌‌‌’. జయ ఆడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన నిర్మించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 23న విడుదల చేయనున్నట్టు సోమవారం ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌‌‌‌గా నటించిన దీపక్ సరోజ్ హీరోగా  ఎంట్రీ ఇస్తున్న చిత్రమిది. అలాగే  హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి దర్శకుల వద్ద పనిచేసిన వి యశస్వీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది.