హైదరాబాద్ లో ఐటీ(ఆదాయపు పన్ను శాఖ) అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఒక ఫార్మా కంపెనీలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈరోజు(జనవరి 9) తెల్లవారు జాము నుంచే ఆదాయపు పన్ను శాఖ అధికారులు బృందాలుగా విడిపోయి ఫార్మా కంపెనీ యజమాని, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు.
తొమ్మిది ప్రాంతాల్లో..
రాయదుర్గం, మొయినాబాద్, కోకాపేట ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ఈ ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. అయితే పెద్ద ఎత్తున ఆదాయపు పన్నును ఎగవేశారన్న ఆరోపణలతో.. ఫార్మా కంపెనీపై దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.