- సీనియర్స్ కి వర్క్ ఫ్రమ్ హోమ్, జూనియర్స్ ఆ ఫీసులకు..
- పెండింగ్ ప్రాజెక్టుల కోసం పిలుస్తున్న కంపెనీలు
- చిన్న సంస్థలతో పెద్దకంపెనీలు టైఅప్
హైదరాబాద్, వెలుగు: లాక్ డౌన్తో సిటీలోని పలు ప్రైవేట్, సాఫ్ట్ వేర్ కంపెనీలు మూతపడగా, కొన్ని ఎంప్లాయిస్ని తగ్గించి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయించాయి. కరోనా ఎఫెక్ట్, మ్యాన్ పవర్ తక్కువగా ఉండటంతో చాలావరకు ప్రాజెక్టులు పెండింగ్లో పడిపోయాయి. ఆ భారం ఇప్పుడు కంపెనీల మీద పడుతోంది. ఇన్టైమ్లో టార్గెట్ రీచ్ అయ్యేందుకు ఆయా కంపెనీలు చిన్న కంపెనీలతో టైఅప్ అయ్యి ఫ్రెషర్స్, ట్రైనీలను వర్క్లోకి తీసుకుంటున్నాయి. దాంతో సొంతూర్లకు వెళ్లిపోయిన వారూ సిటీకి తిరిగొస్తున్నారు.
సపోర్టివ్ టీమ్గా..
సిటీలో ఐటీ సెక్టార్లో వర్క్ చేయాలనుకునే ఫ్రెషర్స్కి 6 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ చూపించే చిన్న కంపెనీలు వందల్లో ఉన్నాయి. ఒక్కో కంపెనీలో బ్యాచ్ల వారీగా 50 నుంచి వందమందికిపైగా డిఫరెంట్ కోర్సుల్లో ట్రైనింగ్ తీసుకుంటుంటారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఆయా కంపెనీలే తాము టైఅప్ అయిన కంపెనీలో రిక్వైర్మెంట్ని బట్టి ఫ్రెషర్స్ని పంపిస్తుంటాయి. అలా ట్రైనింగ్ పూర్తయి జాబ్లో జాయిన్ అయ్యే టైమ్కి లాక్ డౌన్ కారణంగా ఫ్రెషర్స్ సొంతూళ్లకి వెళ్లిపోయారు. ప్రస్తుతం అన్ లాక్ 4 మొదలవడంతో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనే ప్రెజర్స్ కంపెనీలకు పెరుగుతున్నాయి. దాంతో ప్రాజెక్ట్స్ టార్గెట్ రీచ్ అయ్యేందుకు కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నాయి. మెయిన్ టీం చేసే వర్క్లో వాళ్లు సపోర్ట్ టీమ్ఉండనున్నారు.
నో వర్క్ ఫ్రమ్ హోమ్..
కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవుతున్న ఫ్రెషర్స్ కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ లేదు. ఆఫీస్కి వచ్చి డ్యూటీ చేయాలని కంపెనీలు చెప్తున్నాయి. ఎంప్లాయిస్ అంతా ల్యాప్ ట్యాప్ మెయింటెన్ చేయాలని సూచిస్తున్నాయి. సీనియర్ టీమ్ చేసి పంపిన ప్రాజెక్ట్ లో కరెక్షన్స్, డేటా లో మిస్టెక్స్ ఉంటే సపోర్ట్ గా ఉన్న టీం మెంబర్స్ వాటిని ఆఫీస్ లో ఉండి క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇలా తక్కువ టైమ్లో ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకోవాలని పెద్ద కంపెనీలు ప్లాన్ చేసుకుంటున్నాయి. పేమెంట్ తక్కువగా ఉన్నా ఎక్స్ పీరియన్స్ వస్తుందని జాయిన్ అవుతున్నట్లు ఫ్రెషర్స్ చెప్తున్నారు.
మరొక కంపెనీతో టైఅప్..
మా కంపెనీలో బీటెక్ పాస్ అవుట్ అయిన వారికి ఎస్ఏపీ సాఫ్ట్వేర్లో అబాప్, ఎంఎం, పీపీ, ఎస్డీ, ఫికో వంటి కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తుంటాం. సిటీ, బెంగళూరు, ముంబై లో జాబ్స్ ఇప్పిస్తుంటాం. ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న మరో బ్యాచ్కి ఇంటర్వ్యూస్ ఉన్న టైంలోనే లాక్ డౌన్ మొదలైంది. ఇటీవల మేం టైఅప్ అయిన కంపెనీలకి ఎంప్లాయిస్ రిక్వైర్మెంట్ ఉండడంతో ఆన్లైన్లో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి సెలెక్ట్ అయిన వాళ్లకు డ్యూటీకి రావాల్సిందిగా మెయిల్ పంపాం. వాళ్లు మా ఆఫీసులోనే ఉంటూ మరొక కంపెనీకి వర్క్ చేస్తారు. ఆ కంపెనీ శాలరీ ఇస్తుంది.
‑ అభి, మేనేజర్, సాఫ్ట్ వేర్ ట్రైనింగ్,కంపెనీ, జూబ్లీహిల్స్