ఇది కొత్త తరం రొమాంటిక్ లవ్‌‌‌‌స్టోరీ అంటున్న  దర్శకుడు

ఇది కొత్త తరం రొమాంటిక్ లవ్‌‌‌‌స్టోరీ అంటున్న  దర్శకుడు

మా వింత గాథ వినుమా, కృష్ణ అండ్ హిజ్‌‌‌‌ లీల వంటి వెరైటీ కాన్సెప్ట్స్‌‌‌‌తో ఆకట్టుకున్న సిద్ధు జొన్నలగడ్డ.. ఇప్పుడు ‘డిజె టిల్లు’గా వస్తున్నాడు. ఈ చిత్రానికి కథ, మాటలు కూడా తనే రాశాడు. విమల్ కృష్ణ దర్శకుడు. నేహాశెట్టి హీరోయిన్‌‌‌‌. ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌ నుంచి ఆల్రెడీ ఓ సాంగ్ రిలీజై పాపులర్ అయ్యింది. నిన్న మరో పాటను విడుదల చేశారు.

‘రాజా రాజా ఐటమ్ రాజా, రోజా రోజా క్రేజీ  రోజా, లేజీ లేజీ గుండెల్లోనా, డిజె డిజె కొట్టేసిందా.. పటాస్ పిల్ల పటాస్ పిల్ల’ అంటూ సాగే ఈ పాట యూత్‌‌‌‌ని ఆకట్టుకునేలా ఉంది. శ్రీచరణ్ పాకాల ట్యూన్‌‌‌‌కి కిట్టు విస్సా ప్రగడ లిరిక్స్  రాశాడు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ పాటలను  పాడాడు. ఇది కొత్త తరం రొమాంటిక్ లవ్‌‌‌‌స్టోరీ అంటున్నాడు  దర్శకుడు. సితార ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.