గాయం కారణంగా మ్యాచ్ కు రోహిత్ శర్మ దూరం

గాయం కారణంగా  మ్యాచ్ కు రోహిత్ శర్మ దూరం

బంగ్లాదేశ్ తో ఈనెల 22నుంచి మొదలవబోయే రెండవ టెస్ట్ కు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. రెండవ వన్డేలో బొటన వేలికి అయిన గాయం కారణంగా రోహిత్ మైదానాన్ని వీడాడు. దాంతో మొదటి టెస్ట్ ఆడని రోహిత్, గాయం నుంచి కోల్కొని రెండవ టెస్ట్ కు అందుబాటులో ఉంటాడని అనుకున్నారు. కానీ, గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో రెండవ టెస్ట్ కు కూడా దూరం అవనున్నాడు.  

‘రెండో టెస్ట్ కోసం రోహిత్ ఇంకా డాకా రాలేదు. అతని గాయం పూర్తిగా మానలేదు. ఇంకా నొప్పి ఉంది. కాబట్టి రెండో టెస్ట్ లో ఆడే అవకాశం లేదు’ అని బోర్డ్ వర్గాలు సమాచారం ఇచ్చాయి. ప్రస్తుతం ముంబైలో ఉన్న రోహిత్ శర్మకు ఇంకా విశ్రాం తి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. రోహిత్ స్థానంలో కెప్టెన్సీ అందుకున్న కేఎల్ రాహుల్ రెండవ టెస్ట్ కు బాధ్యతలు స్వీకరించనున్నాడు.