ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించేందుకు ఇయ్యాల్నే ఆఖరు

ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించేందుకు ఇయ్యాల్నే ఆఖరు

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలో 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను చెల్లించేందుకు శుక్రవారంతో గడువు ముగుస్తోంది. శుక్రవారం అన్ని సిటిజన్ సర్వీస్ కేంద్రాలు రాత్రి 11 గంటల వరకు పనిచేయనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికీ ట్యాక్స్​ చెల్లించనివారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

సిటిజన్ సర్వీస్ సెంటర్లతోపాటు మీ-సేవ కేంద్రాలు, ఆన్​లైన్​ ద్వారా కూడా చెల్లించవచ్చని తెలిపారు. బల్దియా ఉన్నతాధికారులు ఈ ఆర్థిక సంవత్సరంలో 2 వేల కోట్లు టార్గెట్ పెట్టుకోగా గురువారం నాటికి రూ.1,600 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలైంది. గడువు ముగిసేలోపు ట్యాక్స్​ చెల్లించని వారికి 24 శాతం పెనాల్టీ పడనుంది.