మాదాపూర్లో 400 మందిని.. నిండా ముంచేసిన ఐటీ కంపెనీ.. పాపం.. ఒక్కొక్కరు 3 లక్షలు కట్టారు !

మాదాపూర్లో 400 మందిని.. నిండా ముంచేసిన ఐటీ కంపెనీ.. పాపం.. ఒక్కొక్కరు 3 లక్షలు కట్టారు !

హైదరాబాద్: మాదాపూర్లో ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. NSN ఇన్ఫోటెక్ పేరుతో నమ్ముకున్న ఉద్యోగులను ఘరానా మోసం చేసింది. శిక్షణ ఇచ్చి, ఉద్యోగం ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు వల వేసిన ఈ సంస్థ 400 మంది విద్యార్థుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసింది. ఒక్కో విద్యార్థి నుంచి NSN ఇన్ఫోటెక్ 3 లక్షలు వసూలు చేసింది. ఈ కంపెనీ అధినేత స్వామి నాయుడు భారీగా డబ్బులు వసూలు చేసి పరారు కావడంతో డబ్బులు కట్టిన అభ్యర్థులు లబోదిబోమంటున్నారు.

ఐటీ కేంద్రమైన హైదరాబాద్లో ఇలాంటి సంఘటనలు సర్వ సాధారణమై పోయాయి. నిరుద్యోగులు, ఫ్రెషర్స్ను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగాల పేరుతో నట్టేట ముంచే బురిడీ కంపెనీలు గల్లీకొకటి పుట్టుకొస్తున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా కార్యకలాపాలు నడిపిస్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగంపై మోజుతో నగరానికి వచ్చే యువతనే టార్గెట్ చేస్తూ మోసం చేస్తున్నారు. 

ALSO READ : హైదరాబాద్లో నకిలీ IAS, IPS ఆఫీసర్..

ఐటీ జాబ్పై గంపెడాశలతో నగరానికి వచ్చే యువత నకిలీ కంపెనీల బుట్టలో ఈజీగా పడుతున్నారు. సిటీలో చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు రెంటల్ వర్క్ స్టేషన్లు, అపార్టుమెంట్లలో కార్యకలాపాలు చేసేవే ఎక్కువగా ఉండగా, ఇలాంటి వాటిల్లో.. 90 శాతం ఫేక్ కంపెనీలే ఉంటున్నాయనేది నిపుణుల అభిప్రాయం. ఏదో ప్రాజెక్టు ఉందని అభ్యర్థులను రిక్రూట్ చేసుకోవడం, డిపాజిట్గా కొంత మొత్తం కట్టించుకోవడం పాటు, శిక్షణ ఇతర అంశాలంటూ కాలయాపన చేసి అభ్యర్థి తనకు తానే ఉద్యోగాన్ని వదిలిపోయేలా  ఈ తరహా కంపెనీలు చేస్తుంటాయి.