ముఖ్యమంత్రి పదవికి ఈటల రాజేందరే కరెక్ట్

ముఖ్యమంత్రి పదవికి ఈటల రాజేందరే కరెక్ట్

మహబూబ్‌నగర్: ముఖ్యమంత్రి పదవికి ఈటల రాజేందర్ కరెక్ట్ పర్సన్ అన్నారు కాంగ్రెస్ లీడర్ మల్లు రవి. శుక్రవారం జడ్చర్లలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అచ్చంపేటలో నిర్వహించే రాజీవ్ రైతు భరోసా దీక్షకు రావాలని ఈటలను ఆహ్వానిస్తున్నామన్నారు. రైతు చట్టాల విషయంలో టీఆర్ఎస్ పార్టీది రెండు నాలుకల ధోరణి అన్నారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అంటూ జరిగితే దళితులకు లేదా బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న మల్లు రవి.. ముఖ్యమంత్రి పదవికి ఈటల రాజేందర్ సమర్థుడన్నారు. దళితులకు ఇవ్వాలనుకుంటే బాల్క సుమన్, కొప్పుల ఈశ్వర్, రసమయి బాలకిషన్‌లకు అవకాశం ఇవ్వాలని తెలిపారు. ఉద్యమ సమయం నుంచి కష్టపడ్డ వారికే అవకాశం ఇవ్వాలని.. కేటీఆర్ కన్నా సమర్థులు టీఆర్ఎస్‌లో చాలామంది ఉన్నారని తెలిపారు మల్లు రవి.