నీళ్లనే కాదు… సిల్ట్ నూ లెక్కిస్తున్రు

నీళ్లనే కాదు… సిల్ట్ నూ లెక్కిస్తున్రు
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో భారీగా పూడిక

 

  • అస్పష్టంగా నీటి లెక్కలు.. కేటాయింపులు
  • నామమాత్రంగా సిల్ట్ అరెస్ట్ ట్యాంకులు
  • నష్టపోతున్న చివరి ఆయకట్టు రైతులు

ఆదిలాబాద్, వెలుగు: ఉత్తర తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలకు కీలకంగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో భారీగా పూడిక పేరుకుపోయింది. ఎన్నో ఏండ్లుగా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే బురద, ఇసుక రూపంలో 200 అడుగులకు పైగా చేరిన సిల్ట్ ను తొలగించ కపోవడంతో వాటర్ స్టోరేజీ  కెపాసిటీ క్రమంగా తగ్గుతోంది. కానీ ఆఫీసర్లు సిల్టును సైతం నీటి నిల్వ కిందే లెక్కిస్తున్నారు. ఆ లెక్కల ప్రకారమే కేటాయింపులు చేస్తుండడంతో చివరి ఆయకట్టు భూములకు నీరందక నష్టపోతున్నామని రైతులు అంటున్నారు.

 ఎస్సారెస్పీలో 200 అడుగుల పూడిక

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 1,091 అడుగులు కాగా, 200 అడుగుల మేర పూడిక చేరిందని 15ఏండ్ల క్రితమే తేలింది. అప్పట్లో సీడబ్ల్యూసీ సూచన మేరకు ఇరిగేషన్ ఆఫీసర్లు, జపాన్ టీమ్ ను కలిసి చేసిన పరిశీ లనలో ఈ విషయం బయటపడింది. ఆ సిల్ట్15 టీఎంసీల నీటితో సమానమని నాడు ఆఫీసర్లు, ఇంజినీర్లు అంచనా వేశారు.  ప్రస్తుతం పూడిక మరింత పెరిగిందని, 20 టీఎంసీల మేర నీటిని అడ్డుకుం టోందని చెబుతున్నారు. ఎస్సారెస్పీ కెపాసిటీ 91 టీఎంసీలు కాగా సిల్ట్ కారణంగా 71టీఎంసీలే ఉంటున్నాయి . కానీ ఆఫీసర్లు మాత్రం91టీఎంసీలను లెక్కచూపి కేటాయింపులు చేస్తున్నారు. దీంతో చివరి ఆయకట్టుకు నీరందక రైతులు నష్టపోతు న్నారు. ప్రతి ప్రాజెక్టులో కొత్త గేజ్ లను ఏర్పాటు చేసి నీటి మట్టాన్ని కచ్చితంగా కొలవాలని గతంలోనే సీఎం కేసీఆర్ చెప్పినా ఆ దిశగా ప్రాజెక్టు ఆఫీసర్లు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి.

పనిచేయని సిల్ట్ అరెస్ట్ ట్యాంకులు

ఎ స్సారె స్పీలోకి సిల్ట్ రాకుండా చూసేందుకు  గతంలో ముథోల్ నియోజకవర్గంలో అక్కడక్కడ సిల్ట్ అరెస్ట్ ట్యాంకులను నిర్మించారు. కానీ అవి ఆశించిన స్థాయిలో బురదను
అడ్డుకోలేకపోయా యి. వీటి నిర్మాణం తర్వాత కూడా ఎస్సారెస్పీలోకి  సిల్ట్ వచ్చి చేరుతున్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. దీంతో  పదేళ్ల క్రితం అప్పటి నిజామాబాద్ జిల్లా కలెక్టర్  ప్రాజెక్టులో పూడికను ఉపాధి హామీ  పథకం కింద తొలగించే  ప్రయత్నం చేశారు. కానీ  ఈజీఎస్ కింద రిజర్వాయర్లలో  పూడిక తీయరాదనే నిబంధన ఉండడంతో  మానుకున్నారు.  ప్రస్తుతం రిజర్వాయర్లో 200 అడుగులకు పైగా పేరుకుపో యిన పూడిక తీయడం చాలా కష్టంతో కూడుకున్న పని అని ఆఫీసర్లు అంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొన్నేళలో ఈ ప్రాజెక్టు స్టోరేజీ కెపాసిటీ సగానికి పడిపోతుందని చెబుతున్నారు. ఇదే జరిగితే లక్ష్మి, సరస్వతి కెనాల్ కింద నిజామాబాద్ , ఆదిలాబాద్ జిల్లాల్లో ఉన్న ఆయకట్టు రైతులకు నష్టం జరిగే ప్రమాదముంది. ఇప్పటికే ఈ రెండు జిల్లాల్లో ని టెయిల్ఎండ్ భూములకు ఖరీఫ్ లో సాగు నీరందడం లేదు.

కడెంలోనూ ఇదే పరిస్థితి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టుల్లోనూ భారీగా పూడిక పేరుకపోతోంది. ఈ జిల్లాలోని ప్రాజెక్టు క్యాచ్ మెంట్ఏరియాల్లో నల్ల రేగడి భూములు ఎక్కువగా ఉండడం,  చిన్నపాటి వర్షాలకే ఎక్కువ కోతకు గురవుతుండడం ఇందుకు కారణమని ఇంజినీర్లు చెబుతున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా, 500 అడుగుల వరకు సిల్ట్ ఉన్నట్లు ఆఫీసర్లుఅంటున్నారు.ఈ ప్రాజెక్టు కెపాసిటీ 7 టీఎంసీలు కాగా  కేవలం 4 టీఎంసీలు మాత్రమే స్టోర్ చేయగలుగుతున్నా మని చెబుతున్నారు. స్వర్ణ ప్రాజెక్టు  కెపాసిటీ1,183 అడుగులు కాగా ఇందులో దాదాపు 350 అడుగుల మేర పూడిక ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని రిజ ర్వాయర్లలో  ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి . సాగునీటి ఆఫీసర్లు సిల్ట్ ను లెస్ చేయకుండా పాత కెపాసిటీ ప్రకారమే నీటిని లెక్కలేస్తూ  తమను త ప్పుదో వ పట్టిస్తు న్నారని రైతులు అంటున్నారు. ఎలాగూ నీళ్లు వస్తాయనే మాట నమ్మి పంటలు సాగు చేస్తే చివరికి నీరందక నష్టపోతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రాజెక్టుల్లో పూడిక తొలగించి, చివరి ఆయకట్టుకు నీరందేలా చర్యలు తీసుకో వాలని కోరుతున్నారు.