లోయలో పడ్డ బస్సు.. 10 మంది మృతి

లోయలో పడ్డ బస్సు.. 10 మంది మృతి

జమ్మూ కశ్మీర్ లో ఘోర ప్రమాదం జరిగింది. అమృత్‌సర్‌ నుంచి కత్రా వెళ్తున్న బస్సు జజ్జర్ కోట్లీ ప్రాంతంలో బ్రిడ్జిపై అదుపు తప్పి  లోయలో పడింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడిక్కడే మరణించారు.  మరో 20 మంది గాయపడగా వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. గాయాలైన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

జమ్మూకశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవిఆలయాన్ని దర్శించుకునేందుకు బస్సులో బయల్దేరి వస్తుండగా జజ్జర్ కొట్లి వద్ద బ్రిడ్జిపై బస్సు అదుపు తప్పింది.  ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 75 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 10 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 55 మంది గాయపడ్డారు. ఘటనతో బస్సు నుజ్జునుజ్జు అయ్యింది. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నట్టు జమ్మూ సీనియర్ ఎస్పీ చందన్ కోహ్లీ తెలిపారు.