ఐటీ ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రం హోం ?

ఐటీ ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రం హోం ?

ఐటీ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.  కోవిడ్​ 19 నుంచి కోలుకున్న కంపెనీలు ఉద్యోగులను ఆఫీసు రావాలని లెటర్స్​ పంపించాయి. ఈ లోపుగా జే 1 వైరస్​ విజృభించడంతో మళ్లీ వర్క్​ ఫ్రం హోం విధానాన్ని ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. 

 జే 1 వైరస్​ కరోనా దేశ వ్యాప్తంగా వ్యాపిస్తుంది. కొత్త వైరస్....​ జె 1 వైరస్​ కేసులు  రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి.  పాజిటివ్​ సంఖ్య పెరగడంతో  కొన్ని రాష్ట్రాల్లో కఠినమైన నిబంధనలను పాటించేలా ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటుంది.. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఐటి కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినట్లు  సమాచారం తెలుస్తుంది.. ఈ మేరకు ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ విప్రో కూడా వర్క్ ఫ్రమ్ అని చెప్పింది..హైబ్రిడ్‌ వర్క్‌ చేస్తున్న ఉద్యోగుల్ని విప్రో అప్రమత్తం చేసింది. దేశంలో కొత్త కరోనా ​ జె1 వైరస్​ కేసులు పెరిగిపోతున్న దృష్ట్యా సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

అయితే, కేవలం క్లయింట్‌ల అవసరాలకు అనుగుణంగా, ఓ వైపు సంస్థ వృ‍ద్ది కోసం పాటుపడుతూనే ఉద్యోగులు శ్రేయస్సుకే ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. ప్రస్తుతం  పూర్తిగా టీకాలు వేసుకున్న ఉద్యోగులు వారానికి మూడు రోజులు తిరిగి కార్యాలయాలకు వస్తున్నారు. ఉద్యోగులకు జాగ్రత్త కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటామని విప్రో ఈ సందర్భంగా వెల్లడించింది…

విప్రో ఉద్యోగులు వారానికి 3 రోజులు ఆఫీస్‌కు వస్తే..మరో రెండు రోజులు ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్నారు. మళ్లీ ఇప్పుడు  కోవిడ్‌- జె 1 వైరస్​  కేసులతో తిరిగి ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం.. కొత్త కరోనా కేసులను చూస్తే.. కోవిడ్‌-19, డెల్టా వేరియంట్‌, ఒమిక్రాన్‌.. ప్రస్తుతం జేఎన్‌1 వైరస్‌గా మన ముందుకొస్తోంది. ఇప్పటికే  దేశంలో 4,100 దాటాయి. గడిచిన 24 గంటల్లో 412 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు చెబుతున్నారు..