నవ్వించే నవ్వుల వెనక విషాదం : జబర్దస్త్ కమెడియన్ ఆరోగ్యం విషమం

నవ్వించే నవ్వుల వెనక విషాదం : జబర్దస్త్ కమెడియన్ ఆరోగ్యం విషమం

తెలుగు బుల్లితెరపై విశేషమైన ఆదరణని సంపాదించుకుంది జబర్దస్త్ షో.. ఓ నలబై ఎపిసోడ్స్ చేసి వదిలేద్దాం అనుకున్న ఈ షో మంచి పాపులారిటీని సంపాదించుకొని విరామం లేకుండా కొనసాగుతుంది. ఈ షో ద్వారా ఎక్కడెక్కడి నుండో వచ్చి సెటిల్ అయిన వారు చాలా మందే ఉన్నారు. ఇందులో ఒక్కక్కరు ఒక్కొలాగా తమదైన శైలిలో ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటారు. అలా అందరినీ నవ్వించే ఈ కమెడియన్ల జీవితాల్లో ఎంతో విషాదం ఉందన్నారు నటుడు నాగబాబు.

ఇందులో ఒక నటుడికి ఇలాంటి విషాదమే ఏర్పడింది. అతడు ఎవరో కాదు “పంచ్ ప్రసాద్” .అప్పట్లో యాక్టివ్ గా ఉండే ప్రసాద్ ఒక్కసారిగా జబర్దస్త్ వేదిక పైన కనిపించలేదు. చాలా కాలం వరకు షో కి దూరంగానే ఉన్నాడు. అందరూ ప్రసాద్ మానేశాడు అనే అనుకున్నారు. కానీ అసలు విషయం బయటపెట్టాడు నాగ బాబు .

ప్రసాద్ వెంకీస్ మంకీస్ టీం లో చేస్తున్నప్పుడు తనకి కోపం ఎక్కువగా రావడం, ఊరికే చిరాకు పడటం చూసి ఎందుకిలా చేస్తున్నావని అడిగినప్పుడు అసలు విషయం చెప్పాడు అని అన్నారు. ప్రసాద్ నా దగ్గరికి వచ్చి తన రెండు కిడ్నీలు 80% పాడయ్యాయని. నేను ఇంకా బ్రతకనేమో అని ఏడ్చేవాడని నాగబాబు చెప్పుకొచ్చారు.

ప్రసాద్ ను ఆర్ధికంగా ఆదుకునేందుకు జబర్దస్త్ సభ్యులు ముందుకొచ్చారని చెప్పారు. అయితే ఇప్పుడు సర్జరీ జరగలేదని ,తాను డయాబెటిస్ తో బాధపడుతున్నాడు అన్నారు. .అతి త్వరలోనే సర్జరీ చేయించుకొని మామూలు స్థితికి వస్తాడని నాగబాబు తెలిపారు.