తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్ని ఏడేళ్లుగా నవ్విస్తున్న కామెడీ షో ‘జబర్దస్త్’. ఫన్నీ స్కిట్స్తో నవ్వుల్లో ముంచెత్తుతున్న ఈ షో వచ్చే వారంతో 350 ఎపిసోడ్లు పూర్తి చేసుకోబోతుంది. ఈ గురువారం 350 ప్లస్ స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. దీనికి ‘సుప్రీమ్ హీరో’ సాయి ధరమ్ తేజ్ స్పెషల్ జడ్జిగా వస్తున్నాడు. మరో జడ్జ్ రోజాతో కలిసి ఈ ఎపిసోడ్లో పాల్గోనబొతున్నాడు. ఒక షో వరుసగా 350 వారాలపాటు కొనసాగడం చాలా అరుదైన విషయం.
ఎంటర్టైన్మెంట్ షోలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. రెగ్యులర్గా ఎలాంటి రియాలిటీ షోలు, సీరియల్స్ వచ్చినా టీవీల్లో కామెడీ, ఎంటర్టైన్మెంట్ షోలకు ఉండే క్రేజే వేరు. ఇందుకు తాజా నిదర్శనం జబర్దస్త్ . ఒకప్పుడు సీరియస్గా సాగే ఫ్యామిలీ, రివేంజ్ డ్రామా సీరియల్స్ మధ్య ‘అమృతం’ స్పెషల్గా నిలిచింది. వారానికోసారే వచ్చినా, ఏ సీరియల్కు రాని రెస్పాన్స్ దీనికి వచ్చేది. కామెడీగా సాగడమే దీని సక్సెస్కు కారణం. యూత్, ఫ్యామిలీ అందర్నీ ఆకట్టుకుంది ఈ సీరియల్. ఇది ఆగిపోయి పదేళ్లవుతున్నా దీనికి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆన్లైన్లో దుమ్ముదులుపుతోంది. ఇప్పుడు మళ్లీ అదే రేంజ్ హిట్ కొట్టిన షో ‘జబర్దస్త్ ’. వారానికి రెండు రోజులే అయినా ఈ షో ఎప్పుడూ సూపర్ హిట్గా నిలిచింది. 2012లో మొదలైన ఈ షో ఏడేళ్లుగా ఆడియెన్స్ను అదే రేంజులో ఆకట్టుకుంటోంది. ప్రేక్షకుల స్పందన చూశాక, మొదట వారంలో ఒక్కరోజు మాత్రమే వచ్చే ఈ షోను రెండో రోజు కూడా ‘ఎక్స్ట్రా జబర్దస్త్ ’ పేరుతో నడిపిస్తున్నారు. ఇదంతా ఇప్పుడెందుకంటే ‘జబర్దస్త్ ’ ఈ వారంతో 350 ఎపిసోడ్లు పూర్తి చేసుకోబోతుంది. చాలా షోలు ఇన్ని ఎపిసోడ్లు సాగినా, కొంచెం గ్యాప్తో, వేర్వేరు సీజన్లతో ఆకట్టుకున్నవే. కానీ, జబర్దస్త్ మాత్రం విరామం లేకుండా ప్రతి వారం వస్తోంది. వరుసగా 350 ఎపిసోడ్లు ప్రసారమైన ఎంటర్టైన్మెంట్ టీవీ షోగా ఈ గురువారంతో ఈ ఘనత సాధించబోతుంది ‘జబర్దస్త్ ’. దీనికి మొదటి నుంచి జడ్జిగా ఉన్న నాగబాబు ఇటీవల షో నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో వారానికొకరు చొప్పున సెలబ్రిటీ గెస్ట్లు జడ్జిగా చేస్తున్నారు. గతంలో హీరోలు నిఖిల్, కార్తికేయ, కమెడియన్ అలీలు జడ్జిలుగా చేశారు. వచ్చే జబర్దస్త్ ఎపిసోడ్ లో యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ జడ్జిగా రానున్నాడు. జడ్జెస్ మారుతున్నా, కంటెంట్ మారకుండా నవ్విస్తుండటమే ఈ షో సక్సెస్కు కారణం.