విడిపోయిన గూడ్స్ బోగీలు.. జడ్చర్ల రైల్వే స్టేషన్​లో తప్పిన ప్రమాదం

విడిపోయిన గూడ్స్  బోగీలు.. జడ్చర్ల రైల్వే స్టేషన్​లో తప్పిన ప్రమాదం

జడ్చర్ల టౌన్, వెలుగు : గూడ్స్​ రైలు నుంచి బోగీలు విడిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. హైదరాబాద్​ నుంచి డోన్​ వెళ్తున్న గూడ్స్​ శుక్రవారం ఉదయం 11 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరింది. దాదాపు ఒంటి గంట ప్రాంతంలో జడ్చర్ల స్టేషన్​లోని ప్లాట్​ఫాం నంబర్-2 మీదుగా వెళ్తుండగా, ప్రమాదవశాత్తు​ ఇంజిన్​నుంచి బోగీలు విడిపోయాయి. అప్పటికే స్టేషన్​లో లోకల్​ప్యాసింజర్​ కోసం వెయిట్​ చేస్తున్న ప్రయాణికులు ఇంజిన్​నుంచి బోగీలు విడిపోయిన విషయాన్ని గమనించి కేకలు వేశారు.

అప్రమత్తమైన లోకో పైలట్​ బ్రేకులు వేసి ఇంజిన్​ను ఆఫ్​చేశాడు. అప్పటికే ఇంజిన్​దాదాపు 400 మీటర్ల ముందుకు వెళ్లిపోయింది. మళ్లీ ఇంజిన్​ను రివర్స్​ తీసుకొచ్చి బోగీలను జత చేశారు. ఈ విషయంపై స్టేషన్ మాస్టర్ శంకర్​ను వివరణ కోరగా గూడ్స్ రైలుకు బ్రేకులు వేసే సమయంలో బోగీలకు ఉన్న  క్లిప్పులు ఊడిపోతే ఇలా జరుగుతుందన్నారు. బోగీలు వేరయిన వెంటనే ఇంజిన్​లో ఆటోమెటిక్​గా బ్రేకులు పడతాయన్నారు.