
నిజామాబాద్ నగరంలోని గంజి మార్కెట్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర కన్నుల పండుగగా జరిగింది. ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పాల్గొన్నారు. ఇస్కాన్ ఆధ్యాత్మికవేత్త ప్రణవానంద దాస్ ప్రవచనాలు ఇచ్చారు.
ఎనిమిది సంవత్సరాలుగా గాంధీ గంజ్లో బలరాముడు, సుభద్ర, జగన్నాథుడి విగ్రహాలతో మండపం ఏర్పాటు చేస్తున్నారు. జగన్నాథ రథయాత్ర ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి నెహ్రూ పార్క్, పెద్ద బజార్, ఆర్ఆర్ చౌరస్తా, పులాంగ్, వినాయక్ నగర్, హనుమాన్ జంక్షన్ చేరుకొని తిరిగి పులాంగ్ చౌరస్తా, ఎల్లమ్మ గుట్ట చౌరస్తా, బస్టాండ్ మీదుగా గాంధీ గంజ్కు చేరుకుంటుంది. - వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్