
జగిత్యాల టౌన్, వెలుగు: ఉపాధి కోసం ఇజ్రాయిల్ వెళ్లిన జగిత్యాల పట్టణానికి చెందిన రేవెల్ల రవీందర్(57) సోమవారం గుండెపోటుతో చనిపోయాడు. రెండేండ్ల కింద ఇజ్రాయిల్ కి వెళ్లగా, సోమవారం అక్కడ గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.
డెడ్బాడీని త్వరగా స్వదేశానికి తెప్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం బాధిత కుటుంబ సభ్యులను మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ పరామర్శించారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీమిరెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి త్వరగా డెడ్బాడీని తెప్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.