ఇజ్రాయిల్లో జగిత్యాల వాసి మృతి .. డెడ్బాడీని తెప్పించాలని వేడుకుంటున్న ఫ్యామిలీ మెంబర్స్

ఇజ్రాయిల్లో జగిత్యాల వాసి మృతి .. డెడ్బాడీని తెప్పించాలని వేడుకుంటున్న ఫ్యామిలీ మెంబర్స్

జగిత్యాల టౌన్, వెలుగు: ఉపాధి కోసం ఇజ్రాయిల్​ వెళ్లిన జగిత్యాల పట్టణానికి చెందిన రేవెల్ల రవీందర్(57) సోమవారం గుండెపోటుతో చనిపోయాడు. రెండేండ్ల కింద ఇజ్రాయిల్ కి వెళ్లగా, సోమవారం అక్కడ గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. 

డెడ్​బాడీని త్వరగా స్వదేశానికి తెప్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం బాధిత కుటుంబ సభ్యులను మాజీ మున్సిపల్  చైర్​పర్సన్  అడువాల జ్యోతి లక్ష్మణ్  పరామర్శించారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్  చైర్మన్  మంద భీమిరెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి త్వరగా డెడ్​బాడీని తెప్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.