- తెలుగు రాజ్యాధికార సమితి అధ్యక్షుడు జై భీమ్ శ్రీనివాస్
ఖైరతాబాద్,వెలుగు : వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాల్లో పోటీ చేస్తామని తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ అధ్యక్షుడు జై భీమ్ శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర, తెలంగాణలో ఇప్పటివరకు కమ్మ, రెడ్లు, వెలమలు మాత్రమే సీఎం పీఠంపై కూర్చున్నారని పేర్కొన్నారు. బహుజనులు ముఖ్యమంత్రులు కావాలన్నదే తమ ఆశయమని వ్యక్తంచేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసి మంచి ఫలితాలను సాధించామని పేర్కొన్నారు. హైదరాబాద్ను దేశానికి రెండో రాజధానిగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై కేంద్రానికి వినతి పత్రం కూడా పంపినట్లు గుర్తుచేశారు. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి జల్ది అనిల్కుమార్, సభ్యులు కనక స్వామి, దండెం రవి తదితరులు పాల్గొన్నారు.