‘పాతాళ్ లోక్‌’ చూశారా..? జైదీప్ అహ్లవత్ ఇప్పుడు ఎంత బిజీ అయ్యాడంటే..

‘పాతాళ్ లోక్‌’ చూశారా..? జైదీప్ అహ్లవత్ ఇప్పుడు ఎంత బిజీ అయ్యాడంటే..

పంకజ్ త్రిపాఠి, ప్రతీక్ గాంధీ లాంటి కొందరు నటులు ఓటీటీ వెబ్‌ సిరీస్‌ల పుణ్యమా అని ఓవర్‌‌నైట్ స్టార్స్‌ అయ్యారు. ఈ వరుసలో ‘పాతాళ్ లోక్‌’ ఫేమ్ జైదీప్ అహ్లవత్ కూడా ఉన్నాడు. ఇప్పటికే వచ్చిన రెండు సీజన్స్‌తో మెప్పించిన జైదీప్.. మరోవైపు వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యాడు.  ఎంతలా అంటే.. ‘రామాయణ’ లాంటి ప్రస్టేజియస్ ప్రాజెక్ట్‌లో క్యారెక్టర్‌‌కు డేట్స్‌ అడ్జస్ట్ చేయలేనంత బిజీ అయ్యాడు.

రణబీర్ కపూర్, సాయిపల్లవి జంటగా నితిష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో యశ్, సన్నీడియోల్,  రకుల్ ప్రీత్ సింగ్ సహా పలువురు స్టార్స్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇందులో విభీషణుడి పాత్రకు జైదీప్‌ను సంప్రదించారట మేకర్స్. అయితే రావణుడిగా నటిస్తున్న యశ్‌తో తనకు కాంబినేషన్ సీన్స్ ఉండటం, తన డేట్స్‌కు జైదీప్ డేట్స్‌ సెట్‌ అవకపోవడంతో నో చెప్పాల్సి వచ్చిందట.

ఈ సినిమా మిస్ అయినప్పటికీ షారుఖ్ చిత్రం ‘కింగ్‌’లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. షారుఖ్‌తో స్క్రీన్‌ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ ఈ ప్రాజెక్ట్ గురించి రివీల్ చేశాడు జైదీప్. తనకు ‘జివెల్‌ థీఫ్‌’లో విలన్‌గా లెంగ్తీ రోల్ ఇచ్చిన సిద్ధార్థ్ ఆనంద్.. దానితో పోల్చితే ఇది చిన్న క్యారెక్టర్ అని ఇవ్వడానికి ఆలోచించారు. కానీ  షారుఖ్‌ తనపై అభిమానంతో పట్టుబట్టి తీసుకున్నారని చెప్పుకొచ్చాడు.

ఇక ‘ఫ్యామిలీ మ్యాన్‌’ సీజన్‌ 3లో జైదీప్ నటించబోతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే తాజాగా విడుదల చేసిన నటీనటుల లిస్ట్‌లో జైదీప్ పేరు కనిపించలేదు. మెయిన్ విలన్ క్యారెక్టర్ కావడంతో ఆలస్యంగా రివీల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.