
చెన్నై : ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో దబాంగ్ ఢిల్లీతో జరిగిన లీగ్ మ్యాచ్ను జైపూర్ పింక్ పాంథర్స్ డ్రా చేసుకుంది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్ 32–32తో డ్రా అయ్యింది. ఢిల్లీ రైడర్ అషు మాలిక్ 7 పాయింట్లు సాధించాడు. ఆరంభం నుంచి చెలరేగిన ఢిల్లీ.. జైపూర్ను రెండుసార్లు ఆలౌట్ చేసి 10–4, 20–10 లీడ్లో నిలిచింది. కానీ పట్టు వదలకుండా పోరాడిన జైపూర్ రైడర్లు అర్జున్ 11, అంకూష్ 7, భవానీ రాజ్పుత్ 4, అజిత్ 3 పాయింట్లతో ఆకట్టుకున్నారు. మరో మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ 33–30తో తమిళ్ తలైవాస్ను ఓడించింది. గుజరాత్ ప్లేయర్ రాకేశ్ 9 పాయింట్లు రాబట్టాడు.