
భారత దేశం ఎప్పుడూ అణ్వాయుధ బెదిరింపులకు లొంగదని, ఉగ్రవాదం, దానిని పెంచి పోషించే వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. జాతి ప్రయోజనాల కోసం ఎటువంటి చర్యలకైనా భారత్ ముందుంటుందన్నారు జైశంకర్.
శుక్రవారం (మే30) గుజరాత్లోని పారుల్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల స్నాతకోత్సవ కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ సంబంధాలలో కొన్ని వర్గాలలో బహిరంగ లావాదేవీలు ఒక ఫ్యాషన్"గా మారిందన్నారు.
పర్యాటక ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే ప్రయత్నం చేశారు..
పహల్గాం ఉగ్రదాడితో జమ్మూకాశ్మీర్ లోని పర్యాటక ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే ప్రయత్నం చేశారు. దీంతోపాటు మతపరమైన విభేదాలు రెచ్చగొట్టేందుకు పెద్ద కుట్ర చేశారని జైశంకర్ అన్నారు. ఉగ్రమూకలు చేసిన ఈ అనాగరిక హత్యలకు గట్టి బుద్ధి చెప్పడం అవసరం అని భావించాం.బహవల్పూర్ ,మురిడ్కేలలోని ఉగ్రవాద కమాండ్ కేంద్రాలను నాశనం చేయడం ద్వారా అది సాధించామన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషఇస్తున్న వారు మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు.
కాలం మారిపోయింది .ఉగ్రవాద కేంద్రాలు మూతపడ్డాయి ఇది ఉగ్రవాదం పట్ల భారత్ ఆగ్రహం, దాని చర్యల ద్వారా స్పష్టంగా కనిపిస్తుందని జైశంకర్ అన్నారు.
పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదంపై భారత్ స్పందించిన తీరును ప్రపంచ దేశాలు అర్థం చేసుకున్నాయన్నారు. అది భారత్ చాలా ధైర్యాన్నిచ్చిందన్నారు జైశంకర్. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ ,పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ దళాలు నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
►ALSO READ | 5లక్షల మంది వలసదారులు అమెరికా విడిచి వెళ్లాల్సిందే..అమెరికా సుప్రీంకోర్టు
భారత్, ఇతర దేశాలు అనుసరిస్తున్న దౌత్యం మధ్య వ్యత్యాసం గురించి మాట్లాడారు జైశంకర్. కొన్ని దేశాల "లావాదేవీ" విధానాలను ప్రస్తావించారు. "అంతర్జాతీయ సమాజంలో దాదాపు 200 దేశాల మనకు జాతీయ విధానంపై ఆసక్తి చూపుతున్నాయి. ఇతర దేశాలతో వ్యవహరించేటప్పుడు బహిరంగంగా లావాదేవీలు చేయడం కొన్ని వర్గాలలో ఒక ఫ్యాషన్గా మారింది.
వాలు, విలువలు చాలా ముఖ్యమైనవి. భారతదేశం ఆ కోవకు చెందినది" అని మంత్రి జైంకర్ అన్నారు.భారతదేశం ఒక అరుదైన నాగరిక దేశం.. నేడు ప్రపంచ దేశాల మధ్య సముచిత స్థానాన్ని పొందుతోందని జైశంక్ర్ అన్నారు.