నేటి నుంచి బీసీల రాజకీయ బాట : జాజుల శ్రీనివాస్​ గౌడ్​

నేటి నుంచి బీసీల రాజకీయ బాట :     జాజుల శ్రీనివాస్​ గౌడ్​


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో  శుక్రవారం నుంచి 'బీసీల రాజకీయ బాట' కార్యక్రమాన్ని నిర్వహిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​ గౌడ్​ ప్రకటించారు. బీసీలను రాజకీయంగా ఏకం చేయడానికి, ఓటు చైతన్యం తీసుకురావడానికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ‘ఓ బీసీ మేలుకో.. నీ రాజ్యం ఏలుకో’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జాజుల పేర్కొన్నారు.