మరో ఐదుగురికి రిమాండ్
రూ.4.83లక్షలు, 3బైక్లు, 4 సెల్ఫోన్లు స్వాధీనం
జీడిమెట్ల, వెలుగు: డబ్బులు చోరీ చేసిన దొంగతో పాటు మరో నలుగురిని జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఎల్బీనగర్పరిధి సరూర్నగర్వద్ద గుడిసెల్లో ఉండే రమావత్సైదులు(20) జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్నాడు. ఈనెల 9న షాపూర్నగర్లో ఓ హోల్సేల్షాపులో రూ.4.90 లక్షలు ఎత్తుకెళ్లాడు. షాపు ఓనర్కంప్లయింట్చేయగా పోలీసులు కేసు ఫైల్చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం షాపూర్నగర్ లో సాగర్హోటల్వద్ద సైదులును అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ చేసినట్టు ఒప్పుకున్నాడు. అయితే నిందితుడు చెప్పిన వివరాల ఆధారంగా మరో నలుగురిని అరెస్ట్ చేశారు.
డబ్బులు, బైక్ విడిచిపెట్టి పారిపోగా..
ఈనెల10న మిర్యాలగూడకు పారిపోదామని సైదులు హస్తినాపురం వైన్షాప్వద్ద ఆగాడు. అక్కడే ఉన్న గడిగ సురేశ్, పి.పవన్కుమార్, కుర్ర లవణ్కుమార్, నోముల శివకుమార్, అపుల రవి అనుమానం వచ్చి సైదులును ప్రశ్నించారు. అతడు రూ.4.90లక్షలు నగదు, దొంగిలించిన బైక్ అక్కడే వదిలి పారిపోయాడు. దీంతో నలుగురు ఆ డబ్బులను పంచుకున్నారు. విచారణలో భాగంగా సైదులు చెప్పిన వివరాల ఆధారంగా నలుగురి నుంచి రూ.4.83లక్షల నగదు, 3 బైక్లు, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఇప్పటికే సైదులుపై వివిధ పోలీసు స్టేషన్లలో 7 కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.