జనగామ అర్బన్, వెలుగు: ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా జీపీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరగాలని జనగామ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. గురువారం జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో మొదటి దశ పోలింగ్ కి కావాల్సిన బ్యాలట్పత్రాలను సంబంధిత ఎంపీడీవోలకి అందజేశారు. స్ట్రాంగ్రూంలో జరిగిన ఈ ప్రక్రియని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి దశలో చిల్పూర్, ఘనపూర్, రఘునాథపల్లి, జాఫర్ఘడ్, లింగాల ఘనపూర్మండలాల్లో జరగనున్న ఎన్నికలకు అవసరమయ్యే బ్యాలెట్పత్రాలు, స్టేషనరీ సామాను ఎంపీడీవోలకు అందజేసి, పలు సూచనలు చేశారు. ఎంపీడీవోలు తమ మండల పరిధిలో, ఎన్నికలు జరుగనున్న జీపీల వారీగా పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్యకు ఫారం 9 ఆధారంగా ఆర్వో 2 కు ఓటరు జాబితాలోని ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా కేటాయించాలని సూచించారు.
ఆర్వో 2 ఆధ్వర్యంలో పోలింగ్ సిబ్బందికి ఫారం 14 దరఖాస్తు చేసుకున్న వాళ్లు ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రం అందుబాటులో ఉంటుందని మొదటి విడత ఎన్నికలు జరిగే 5 మండలాల ఎంపీడీవో ఆఫీస్ లో ఈ నెల 9న వినియోగించుకోవచ్చని తెలిపారు. ఆ మండలాల్లో ఓటరుగా నమోదు అయినవారు తమ ఎన్నికల నియామకం పత్రం, ఓటరు గుర్తింపు కార్డు జిరాక్స్ ను ఫారం 14కు జత చేసి సంబంధిత ఎన్నికల అధికారికి అందజేయాలన్నారు.
