గ్రీవెన్స్​ అప్లికేషన్లను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్​రిజ్వాన్ బాషా షేక్

గ్రీవెన్స్​ అప్లికేషన్లను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్​రిజ్వాన్ బాషా షేక్

జనగామ/ ములుగు, వెలుగు: గ్రీవెన్స్​కు వచ్చే అప్లికేషన్లను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్లు అధికారులను ఆదేశించారు. సోమవారం జనగామ కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్​రిజ్వాన్ బాషా షేక్ వినతులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్​ వివిధ శాఖల అధికారులతో రివ్యూ చేపట్టి మాట్లాడారు. 

ఇందిరమ్మ ఇండ్ల వెరిఫికేషన్​ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ధాన్యం చెల్లింపుల్లో జనగామ రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.  ములుగు కలెక్టరేట్​లో నిర్వహించిన గ్రీవెన్స్​లో వివిధ సమస్యలపై మొత్తం 53 ఫిర్యాదులు వచ్చాయని అడిషనల్​ కలెక్టర్​ సంపత్​రావు తెలిపారు.