
జనగామ, వెలుగు : వానాకాలం పంటల పెట్టుబడి సాయం కోసం ప్రభుత్వం రైతు భరోసా నిధులను అందిస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. జనగామ జిల్లాలో ఇప్పటి వరకు 1,75,563 మంది రైతులకు రూ.211.21 కోట్ల నిధులు రైతుల అకౌంట్లలో నేరుగా జమ చేసినట్లు తెలిపారు.
జిల్లాలో 12 మండలాలు ఉండగా, పాలకుర్తి మండలంలో 22,500 మంది రైతులకు రూ.27.06 కోట్లు, రఘునాథపల్లిలో 20,077 మందికి రూ.24.76 కోట్లు, బచ్చన్నపేటలో 17,431 మందికి రూ.21.77 కోట్లు, దేవరుప్పులలో 16,558 మందికి రూ.20.67 కోట్లు, జనగామలో 15,076 మందికి రూ.17.86 కోట్లు, జఫర్గడ్ లో 14,609 మందికి రూ.16.39 కోట్లు, లింగాల ఘన్పూర్లో 14,386 మందికి రూ.18.08 కోట్లు, స్టేషన్ఘన్పూర్ లో 14,085 మందికి రూ.15.57 కోట్లు, చిల్పూర్లో 12,571 మందికి రూ.14.90 కోట్లు, నర్మెటలో 10,430 మందికి రూ.12.51 కోట్లు, తరిగొప్పులలో 8,048 మందికి రూ.9.77, కొడకండ్ల మండలంలో 9,792 మంది రైతులకు రూ.11.80 కోట్లు అకౌంట్లలో జమచేశామన్నారు.