విశాఖపట్నం , వెలుగు: టీడీపీ అవినీతి తాటతీసింది జనసేన పార్టీయేనని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిచ్చిపిచ్చిమాటలు మానుకోవాలని హెచ్చరించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు జగన్ సన్నిహితుడని,అందుకే కేంద్రం సహకారం తీసుకుంటున్నారని ఆరోపించారు. శుక్రవారం విశాఖపట్నం జిల్లాలో తాను పోటీ చేస్తున్న గాజువాక నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేశారు. “జనసేన అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుం ది. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చా. వైజాగ్ కి కొత్వాల్ గా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ బరిలో ఉన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో సిద్ధం చేశాం . ప్రభుత్వ ఉద్యోగులకు సీపీస్ రద్దు చేసి పాత పింఛన్ అమలు చేస్తాం. పన్నుల భారం తగ్గిస్తాం . ఐదేళ్లలో 50 లక్షల మొక్కలు నాటిస్తా. చిరు వ్యాపారులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం ” అని అన్నారు. గాజువాక ప్రాంతాన్ని మోడర్న్ మినీ సిటీగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. 64 అంశాలతో గాజువాకకు మేనిఫెస్టో విడుదల చేశారు.
టీడీపీ అవినీతి తాట తీసింది జనసేనే
- Telugu States
- March 31, 2019
లేటెస్ట్
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం
- పీఓకేను స్వాధీనం చేసుకుంటం: అమిత్ షా
- Federation Cup 2024: బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఖాతాలో స్వర్ణం
- T20 World Cup 2024: కోహ్లీతో జాగ్రత్త.. పాక్ ఆటగాళ్లను హెచ్చరించిన మాజీ కెప్టెన్
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కేసీఆర్ పిలుపు
- ఏందమ్మా ఇది... . దోమల బ్యాట్ను ఇలా కూడా వాడతారా..
- టెట్ పరీక్ష హాల్టికెట్ల విషయంలో గందరగోళం
- PBKS vs RR: పంజా విసిరిన పంజాబ్ బౌలర్లు.. ఎదుట స్వల్ప లక్ష్యం
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- టూర్లకు పోతున్న లీడర్లు
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- యాదాద్రి పవర్ ప్లాంట్ ఫస్ట్ ఫేజ్ షురూ