యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోండి : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోండి : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

జనగామ అర్బన్, వెలుగు : రైతులకు యూరియా ఎరువుల పంపిణీని మరింత పారదర్శకంగా, సమర్దవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎరువుల బుకింగ్​ యాప్​ను ప్రతి రైతు తప్పనిసరిగా వినియోగించాలని, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని జనగామ కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్ సూచించారు. సోమవారం జనగామ పట్టణంలోని గ్రోమోర్​ ఎరువుల దుకాణాన్ని కలెక్టర్​ ఆకస్మిక తనిఖీ చేసి, యూరియా యాప్​ ద్వారా ఇప్పటి వరకు జరిగిన అమ్మకాల ను సంబంధిత రిజిస్టర్​ లో పరిశీలించారు. 

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని రైతులందరూ ఈ యాప్​ను వినియోగించాలని, ఎలాంటి సందేహాలున్నా సమీపంలోని వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ అపర్ణ, టెక్నీకల్​ ఏవో శరత్​ చంద్ర తదితరులు పాల్గొన్నారు.