జనగామ అర్బన్, వెలుగు : ఈ నెల17న నిర్వహించనున్న మూడవ విడత పోలింగ్ పై జనగామ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రిజ్వాన్ భాషా షేక్ సోమవారం దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల మండలాల్లో ఏర్పాట్లపై అడిషనల్ కలెక్టర్ పింకేశ్కుమార్, జడ్పీ సీఈవో, ఆర్డీవోలు, డీఆర్డీవో, డీఎస్డీవో, మండల స్పెషల్ ఆఫీసర్లు, డీఎల్పీవో, కలెక్టరేట్ఏవో, ఈడీఎం, తహసీల్దార్లతో గూగుల్ మీటింగ్ద్వారా రివ్యూ చేశారు.
డిస్ట్రిబ్యూషన్ సెంటర్, పోలింగ్, కౌంటింగ్, ఇతర అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడవ విడత ఎన్నికల్లో వివిధ శాఖల అధికారులు సమన్వయంగా పనిచేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు ఉండాలన్నారు. కౌంటింగ్ వేగవంతంగా అయ్యేందుకు సరిపడా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
