
టోక్యో: ఇండియా స్టార్ షట్లర్లు లక్ష్యసేన్, హెచ్.ఎస్. ప్రణయ్, సాత్విక్–చిరాగ్ షెట్టి జోడీ.. జపాన్ ఓపెన్లో క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన మెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో లక్ష్యసేన్ 21–14, 21–16తో కెంటా సునెయమా (జపాన్)పై గెలిచాడు. మరో మ్యాచ్లో ఎనిమిదో సీడ్ ప్రణయ్ 19–21, 21–9, 21–9తో సహచరుడు కిడాంబి శ్రీకాంత్పై నెగ్గాడు. 57 నిమిషాల మ్యాచ్లో శ్రీ తొలి గేమ్లో గట్టిపోటీ ఇచ్చినా తర్వాతి రెండు గేమ్ల్లో తేలిపోయాడు.
ప్రణయ్ కొట్టిన క్రాస్ కోర్టు స్మాష్లను తీయడంలో ఇబ్బందిపడ్డాడు. మెన్స్ డబుల్స్లో మూడోసీడ్ సాత్విక్–చిరాగ్ షెట్టి 21–17, 21–11తో జెప్పీ బే–లాసీ మెల్హెడ్ (డెన్మార్క్)పై నెగ్గారు. 36 నిమిషాల మ్యాచ్లో ఇండియన్ జోడీ తమ ట్రేడ్ మార్క్ షాట్లతో ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం చూపెట్టింది. విమెన్స్ డబుల్స్లో గాయత్రి గోపీచంద్–ట్రిసా జోలీ 12–23, 19–21తో నమి మట్సుయమా–చిహారు షిడా (జపాన్) చేతిలో పోరాడి ఓడారు.