
టోక్యో: జపాన్ అంటేనే గుర్తుకొచ్చేది టెక్నాలజీ. హై స్పీడ్ రైల్ నెట్వర్క్, బెస్ట్ ఎయిర్పోర్టులు, ఎంతటి తీవ్రమైన భూకంపాలనైనా తట్టుకుని నిలబడే బిల్డింగ్లు జపాన్లోనే కనిపిస్తాయి. తాజాగా ఈ దేశం మరో రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత హై స్పీడ్ ఇంటర్నెట్ కలిగిన కంట్రీగా జపాన్ నిలిచింది. ఎంత స్పీడ్ అంటే.. కండ్లు మూసి తెరిచేలోగా నెట్ఫ్లిక్స్లో ఉన్న డేటా మొత్తం డౌన్లోడ్ అయ్యేటంత. అవును.. ఒక సెకన్లోనే నెట్ఫ్లిక్స్లో ఉన్న వీడియోలన్నీ డౌన్లోడ్ అవుతాయి. కేవలం ఒకే ఒక సెకండ్ కు 1.02 పెటా బైట్స్ వేగంతో (పెటా బైట్ అంటే 10 లక్షల జీబీలు) డేటా ట్రాన్స్ఫర్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇండియా ఇంటర్నెట్ స్పీడ్తో పోల్చుకుంటే.. సుమారు 1.6 కోట్ల రెట్లు అధికం.
మన దేశంలో సెకన్కు యావరేజ్ ఇంటర్నెట్ స్పీడ్ 63.55 ఎంబీగా ఉంది. అటు అమెరికాతోనూ పోల్చుకుంటే జపాన్ ఇంటర్నెట్ స్పీడ్ 3.5 మిలియన్ టైమ్స్ అధికం అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (ఎన్ఐసీటీ) తెలిపింది. ఒక కోటి 8కే క్వాలిటీ వీడియోలను ఏకకాలంలో స్ట్రీమ్ చేయొచ్చు. లేదంటే 6.70 కోట్ల పాటలను సెకన్లో డౌన్లోడ్ చేయొచ్చు. ఇంగ్లిష్ వికీపీడియాలోని డేటాను సెకన్లో 10వేల సార్లు డౌన్లోడ్ చేయొచ్చు. సెకన్లోనే 10వేల 4కే క్వాలిటీ సినిమాలను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎన్ఐసీటీ తెలిపింది. ఇంతటి ఇంటర్నెట్ స్పీడ్ కోసం 19 -కోర్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ను ఉపయోగించారు. ఇందుకోసం సైంటిస్టులు ట్రాన్స్మీటర్లు, రిసీవర్లు, 19 లూపింగ్ సర్క్యూట్లను వినియోగించారు.
ఈ లూపింగ్ సర్క్యూట్ ఒక్కోటి 86.1 కిలో మీటర్ల పొడవు ఉంది. ఇలాంటి 21 లూప్స్ నుంచి సిగ్నళ్లు వెళ్లి డేటాను అందిస్తాయి. దీని సాయంతోనే సెకనుకు 1808 కిలో మీటర్ల దూరం వరకు డేటాను పంపించేందుకు వీలవుతుంది. ఎలక్ట్రిక్ ఫైబర్ కేబుల్ను సుమిటోమో ఎలక్ట్రిక్ అనే కంపెనీ తయారు చేసింది. ఇంటర్నేషనల్ టీమ్ హెల్ప్తో ఎన్ఐసీటీ ట్రాన్స్మిషన్ సిస్టమ్ను బిల్డ్ చేసింది. 2024లో సెకన్కు 402 టెరాబిట్స్ స్పీడ్ ఉండగా.. దాన్ని తాజాగా 1.02 పెటా బైట్స్ స్పీడ్కు పెంచారు.