ఆసీస్తో చివరి రెండు టెస్టులకు బుమ్రా దూరం..!

ఆసీస్తో చివరి రెండు టెస్టులకు బుమ్రా దూరం..!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి రెండు టెస్టులకు దూరమైన టీమిండియా బౌలర్ బుమ్రా..మిగిలిన రెండు టెస్టుల్లో కూడా ఆడేది అనుమానంగా మారింది. వెన్ను నొప్పి గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోని  కారణంగా చివరి రెండు టెస్టులకూ బుమ్రా దూరంగా ఉండబోతున్నాడని తెలుస్తోంది. తొలి రెండు టెస్టులకు ఎంపిక చేసిన 17 మంది సభ్యుల జట్టులో బుమ్రా స్థానం దక్కించుకున్నాడు. అయితే గాయం పూర్తిగా నయం కాకపోవడంతో తొలి రెండు టెస్టులకు అతను దూరమయ్యాడు. తాజాగా సిరీస్ మొత్తానికి అతను అందుబాటులో ఉండడని సమాచారం. 

వరల్డ్ కప్ కోసమేనా..!

బుమ్రా చివరి సారిగా 2022లో ఇంగ్లాండ్ సిరీస్లో పాల్గొన్నాడు. ఆ సిరీస్ తర్వాత వెన్నులో నొప్పి రావడంతో టీమిండియాకు దూరమయ్యాడు. బుమ్రా లేకుండానే భారత్ ఆసియాకప్, టీ20 వరల్డ్ కప్ ఆడింది. బలహీనమైన బౌలింగ్ విభాగంతో ఈ రెండు మెగా టోర్నీల్లో భారత్ ఓడిపోయింది. అయితే ఈ ఏడాది చివర్లో భారత్ లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో రిస్క్ చేయకూడదన్న ఉద్దేశంతోనే బుమ్రాను మిగిలిన రెండు టెస్టులకు దూరంగా టీమ్ మేనేజ్ మెంట్ ఉంచిందని తెలుస్తోంది. అయితే వన్డే సిరీస్ వరకు అతను అందుబాటులోకి వస్తాడా లేదా అన్నది త్వరలో బీసీసీఐ వెల్లడించనుంది. 

బుమ్రా ఎక్కడున్నాడు..?

వెన్నునొప్పి గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బుమ్రా ప్రస్తుతం బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అక్కడ నితిన్ పటేల్ ఆధ్వర్యంలో బుమ్రా శిక్షణ తీసుకుంటున్నాడు. గాయం నుంచి కోలుకుంటున్న బుమ్రా NCA బౌలింగ్ సెషన్లలో పాల్గొంటున్నాడు. 

ICC వన్డే వరల్డ్ కప్ 2023 భారత్‌లో జరగనుంది. అక్టోబర్ -నవంబర్‌లలో ఈ మెగా టోర్నీ ఉండనుంది. నవంబర్ 26న ఫైనల్ జరుగుతుంది. చివరిసారిగా భారతదేశం క్రికెట్ ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇచ్చింది,