మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో HMT మైదానం అవరణలోని కుంటలో స్థానికులకు మృతదేహం కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గుర్తు తెలియని మృతదేహన్ని అదుపులోకి తీసుకున్నారు. 

ALSO READ: పేరంట్స్ షాక్ : 13 ఏళ్ల పిల్లోడు.. స్కూల్ లో PT చేస్తూ చనిపోయాడు

20 రోజుల క్రితమే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు సూమారు 50 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేశారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యప్తు చేపట్టారు.