జేఈఈ మెయిన్ షెడ్యూల్ విడుదల.. ఎన్టీఏ కీలక నిర్ణయం

జేఈఈ మెయిన్ షెడ్యూల్ విడుదల.. ఎన్టీఏ కీలక నిర్ణయం

న్యూఢిల్లీ : జేఈఈ మెయిన్‌ షెడ్యూల్‌ను విడుదల చేసింది నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ. ఈ ఏడాది రెండు విడుతల్లో మాత్రమే జేఈఈ మెయిన్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పింది. ఏప్రిల్‌ 16 నుంచి 21 వరకు మొదటి సెషన్‌, మే 24 నుంచి 29 వరకు రెండో సెషన్‌ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఎన్‌టీఏ సీనియర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సాధనా పరాషర్‌ తెలిపారు. విద్యార్థులకు మార్చి ఒకటో తేదీ నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. జేఈఈ మెయిన్‌ పరీక్షలను 2019, 2020లో ఆన్‌లైన్‌ విధానంలో రెండు విడుదలుగా నిర్వహించగా.. గతేడాది కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా విద్యార్థుల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నాలుగు సార్లు నిర్వహించామన్నారు.  ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితి నెలకొన్న క్రమంలో యథావిధిగా రెండు విడుతల్లోనే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం:

అవన్నీ రూమర్స్.. నా పెళ్లికి ఇంకా టైమ్ ఉంది

ఆకట్టుకుంటున్న శంకరుడి సైకత శిల్పం

నీళ్లు, బువ్వ లేకుండా 12 గంటలుగా క్యూలోనే ఉన్నం