మెస్సీ ఆటోగ్రాఫ్ చేసిన జెర్సీని అందుకున్న జీవా ధోని

మెస్సీ ఆటోగ్రాఫ్ చేసిన జెర్సీని అందుకున్న జీవా ధోని

సాకర్ దిగ్గజం లియొనెల్ మెస్సీ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఆయనను క్రికెటర్లు కూడా ఆరాధిస్తుంటారు. మెస్సీ కూడా ధోనీ, కోహ్లీలను ఫాలో అవుతున్నాడు. అయితే, ప్రపంచకప్ నెగ్గిన ఆనందంలో ఉన్న మెస్సీ తనను సపోర్ట్ చేసిన అభిమానులకు గిఫ్ట్ పంపుతూనే ఉన్నాడు. తాజాగా భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని కుమార్తె జీవా ధోనికి తను ఆటోగ్రాఫ్ చేసిన జెర్సీని గిఫ్ట్ గా పంపించాడు. దానిపై ‘పారా జీవా’ అని రాసి ఉంది. అంటే ‘ఫర్ జీవా. జీవా కోసం’ అని అర్థం. 

ధోనికి క్రికెట్ తో పాటు ఫుట్ బాల్ అంటే కూడా చాలా ఇష్టం. తండ్రిలానే జీవా కూడా ఆటను ఫాలో అవుతుంటుంది. మెస్సీ ఆటను ఇద్దరు కలిసి చూస్తుంటారు. అయితే, మెస్సీ పంపిన జెర్సీని అందుకున్న జీవా మురిసిపోతూ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసింది. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.