జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి బాండ్ పేపర్ రాసిచ్చారు. ఆరు గ్యారంటీలు ప్రభుత్వ పరంగా అమలు చేస్తానని బాండ్ పేపర్ లో రాసిచ్చిన జీవన్ రెడ్డి.. నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానంటూ బాండ్ పేపర్ లో తెలిపారు.
రామాలయంలో పూజల అనంతరం ప్రమాణం చేసారాయన . జగిత్యాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు జీవన్ రెడ్డి. గత పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు తెస్తానంటూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వి్ంద్ బాండ్ పేపర్ రాసిచ్చిన సంగతి తెలిసిందే.