రూ.699 జియో ఫోన్ ఆఫర్ పొడిగింపు

రూ.699 జియో ఫోన్ ఆఫర్ పొడిగింపు

న్యూఢిల్లీ: జియో ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్ చెప్పింది రిలయన్స్. దీపావళి సందర్భంగా రూ.1500ల ఫోన్ ను రూ.699కే అందిస్తున్న విషయం తెలిసిందే. ఆఫర్ అనౌన్స్ చేసినప్పట్నుంచే ఈ ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. దీంతో మరిన్ని రోజులు ఈ ఆఫర్ ను పొడిగిస్తున్నట్లు శుక్రవారం తెలిపింది రిలయన్స్ జియో.

జియోఫోన్ దివాళీ 2019 ఆఫర్‌ ను మరో నెలరోజుల పాటు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. నవంబర్‌ నెల మొత్తం ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది కంపెనీ.