ఓటు హక్కు వినియోగానికి ఫెసిలిటేషన్​ సెంటర్లు

ఓటు హక్కు వినియోగానికి ఫెసిలిటేషన్​ సెంటర్లు

కామారెడ్డి టౌన్, వెలుగు: ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు తమ ఓటు హక్కును  వినియోగించుకునేందుకు ఫెసిలిటేషన్​సెంటర్లు ఏర్పాటు చేసినట్లు కామారెడ్డి కలెక్టర్​ జితేశ్ ​వి పాటిల్​ పేర్కొన్నారు. ఆదివారం కామారెడ్డి ఆర్డీవో ఆఫీస్​లో ఏర్పాటు చేసిన సెంటర్​ను ఆయన పరిశీలించారు. ఈ సెంటర్లు ఈ నెల 27 వరకు కొనసాగుతాయన్నారు. జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు సంబంధించి కలెక్టరేట్​లో, కామారెడ్డి నియోజకవర్గానికి స్థానిక ఆర్డీవో ఆఫీస్​లో సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సందేహలు ఉంటే నివృత్తి చేసుకోవాలన్నారు.        

ఆఫీసర్లు అలర్ట్​గా ఉండాలి

పోలింగ్​ రోజుకు 48 గంటల ముందు అత్యంత కీలకమని, ఆఫీసర్లు అలర్ట్​గా ఉండాలని కలెక్టర్​ జితేశ్​వి పాటిల్​ఆఫీసర్లకు సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారం ఆఫీసర్లు విధులు నిర్వహించాలన్నారు. 48 గంటల ముందు నుంచి ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు.