
యాదాద్రి, వెలుగు: బీజేపీకి తాను మానసికంగా ఎప్పుడో దూరమయ్యాయని బీజేపీ నేత జిట్టా బాలక్రిష్ణారెడ్డి చెప్పారు. కాంగ్రెస్ నుంచి తనకు ఆహ్వానం అందిందని, అనుచరులతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని అన్నారు. మంగళవారం యాదాద్రి జిల్లా భువనగిరిలో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతాయనే బీజేపీలో చేరానని గుర్తుచేశారు.
ALSO READ :తెలంగాణకు అతి భారీ వర్ష సూచన....ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్...
కానీ, తాను కార్యకర్తగా మాత్రమే ఆ పార్టీలో ఉన్నానని, మానసికంగా ఎప్పుడో దూరం అయ్యానని తెలిపారు. అన్ని పార్టీల కంటే బీజేపీలోనే గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయ న్నారు. సామాన్య కార్యకర్తగా వచ్చి, కింది స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసిన బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించడం సరికాదన్నారు.