డిసెంబర్ 14న సందీపని కాలేజీలో జాబ్​మేళా

డిసెంబర్ 14న  సందీపని కాలేజీలో జాబ్​మేళా

కామారెడ్డి టౌన్, వెలుగు: జిల్లా కేంద్రంలోని సందీపని డిగ్రీ కాలేజీలో ఈ నెల 14న జాబ్​మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్​ సాయిబాబా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కిమ్స్​ ఫౌండేషన్​ అండ్ ​రీసెర్చ్​సెంటర్​ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ, ఉపాధి కల్పన మేళా ఉంటుందన్నారు.

టెన్త్, ఇంటర్, డిగ్రీ కంప్లీట్​ అయినవారు ఈ మేళాకు హాజరవ్వాలని కోరారు. అర్హతలను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎంపికైన వారికి ట్రైనింగ్ ​ఇస్తారని తెలిపారు.