లింక్డ్ఇన్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలో ఉద్యోగాలు పెరుగుతాయని ఇండియన్ ప్రొఫెషనల్స్ ఆశాభావంతో ఉన్నారు. ప్రతి ఐదుగురిలో ఇద్దరు ప్రొఫెషనల్స్(40 శాతం మంది) జాబ్స్ పెరుగుతాయని అభిప్రాయం వ్యక్తం చేసినట్టు లింక్డ్ఇన్ ఇయర్ ఎండ్ డేటా పేర్కొంది. ఈ డేటా ప్రకారం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యలో కాన్ఫిడెన్స్ స్కోర్ స్థిరంగా 50 నుంచి 57 మధ్యలో ఉంది. ఇయర్ ఎండ్ డేటా ప్రకారం ప్రతి ఐదుగురిలో ఇద్దరు ఇండియన్ ప్రొఫెషనల్స్ కొత్త జాబ్స్ పెరుగుతాయని అంచనావేయగా.. ఇద్దరిలో ఒక్కరువచ్చే 6 నెలల్లో తమ కంపెనీలు మెరుగైన పర్ఫార్మెన్స్ కనబరుస్తాయని అంచనావేశారు. ఏప్రిల్ నుంచి నవంబర్ 2020 మధ్య 21,066 మందిపై లింక్డ్ఇన్ ఆన్లైన్ సర్వే చేసింది.
For More News..