అస్సాం రైఫిల్స్​లో పదో తరగతితో జాబ్స్

అస్సాం రైఫిల్స్​లో పదో తరగతితో జాబ్స్

ట్రేడ్​మెన్, టెక్నీషియన్​ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1230 పోస్టుల భర్తీకి అస్సాం రైఫిల్స్‌‌ నోటిఫికేషన్‌‌ విడుదల చేసింది. మొత్తం ఖాళీల్లో తెలంగాణలో 48, ఆంధ్రప్రదేశ్‌‌లో 64 చొప్పున పోస్టులు ఉన్నాయి.

పోస్టులు: రైఫిల్​మెన్​, హవిల్దార్​, నైబ్​ సుబేదార్​, రైఫిల్​ఉమెన్​
ట్రేడులు: క్లర్క్​, పర్సనల్​ అసిస్టెంట్​, ఎలక్ట్రికల్​ ఫిట్టర్​ సిగ్నల్​, లైన్​మెన్​ ఫీల్డ్​, వెహికల్​ మెకానిక్​
అర్హతలు: పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 
వయసు: 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు అర్హులు.
సెలెక్షన్​ ప్రాసెస్​: ఫిజికల్‌‌ స్టాండర్డ్​ టెస్ట్‌‌, ఫిజికల్​ ఎఫీషియన్సీ టెస్ట్,  రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
రాతపరీక్ష: మొత్తం 100 మార్కులకు క్వశ్చన్​ పేపర్​ ఉంటుంది. 
ఫిజికల్​ ఎఫీషియన్సీ టెస్ట్​: పురుషులు 5 కి.మీ. పరుగును 24 నిమిషాల్లో పూర్తి చేయాలి. స్త్రీలు 1.6 కి.మీ. పరుగు 8.30 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి.  దరఖాస్తులు: ఆన్‌‌లైన్‌‌లో అప్లై చేయాలి
అప్లికేషన్​ ఫీజు: జనరల్​ అభ్యర్థులు రూ.200
చివరితేదీ: 25 అక్టోబర్‌‌
వెబ్‌‌సైట్‌‌: www.assamrifles.gov.in