జర్నలిస్టులను అరెస్ట్ చేయించిన యాదాద్రి ఈవో

జర్నలిస్టులను అరెస్ట్ చేయించిన యాదాద్రి ఈవో

యాదాద్రి: మీడియాపై ఆంక్షలు ఎత్తేయాలంటూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేయడం వివాదాస్పదంగా మారింది. కొండపైకి వెళ్లడానికి తమకు కూడా ఆంక్షలు విధించడంతో జర్నలిస్టులు నిరసనకు దిగారు. దాంతో ఈ గొడవ కాస్త ఉద్రిక్తంగా మారింది. యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి కావాలనే తమ వారిని అరెస్ట్ చేయించారంటూ యాదగిరిగుట్ట పీఎస్ ఎదుట జర్నలిస్టులు నిరసనకు దిగారు. తమ సమస్యలను పట్టించుకోవడం లేదని గీతారెడ్డిపై ఫైర్ అయ్యారు. ఈ నిరసనకు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతోపాటు సీపీఐ, సీపీఎం లీడర్లు సంఘీభావం తెలిపారు. జర్నలిస్టులకు మద్దతుగా ధర్నాలో కూర్చున్నారు. 

మరిన్ని వార్తల కోసం:

అమిత్ షా, చిదంబరం పలకరించుకున్రు

మాట నిలబెట్టుకున్న రాజమౌళి

15 రోజుల్లో 13వ సారి పెరిగిన పెట్రోల్ రేటు