హైదరాబాద్ నుంచి రెండు గంటల్లో బెంగళూరుకు

హైదరాబాద్ నుంచి రెండు గంటల్లో బెంగళూరుకు
హైదరాబాద్​ నుంచి మరో బుల్లెట్​  ట్రైన్​ను ప్రతిపాదించిన రైల్వే శాఖ రూ. లక్షా 23 వేల 600 కోట్లతో 618 కిలోమీటర్ల మేర కారిడార్​ హైదరాబాద్​, వెలుగు: సూపర్​ ఫాస్ట్​ ఎక్స్​ప్రెస్​లో బెంగళూరుకు పోవాలంటే కనీసం ఆరు గంటలైనా పడుతుంది. ఆ టైం 2 గంటలకు తగ్గితే.. జర్నీ హాయిగా ఉంటుంది కదా. దాన్ని నిజం చేసేలా హైదరాబాద్​ నుంచి బెంగళూరుకు బుల్లెట్​ ట్రైన్​ పరుగులు పెట్టనుంది. ఇప్పటికే హైదరాబాద్​– ముంబై రూట్​లో బుల్లెట్​ ట్రైన్​కు ప్రతిపాదించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా హైదరాబాద్​– బెంగళూరుకూ మరో బుల్లెట్​ ట్రైన్​ నడపాలని నిర్ణయించింది. దేశంలో 12 కారిడార్లను ఏర్పాటు చేయడానికి నిర్ణయించిన రైల్వే శాఖ.. అందులో హైదరాబాద్​–బెంగళూరు కారిడార్​ను రూ.లక్షా 23 వేల 600 కోట్లతో నిర్మించాలని నిర్ణయించింది. 618 కిలోమీటర్ల మేర కారిడార్​ను నిర్మించనుంది. ప్రాజెక్టు​ను 2031–2041 మధ్య పూర్తి చేయాలని టార్గెట్​గా పెట్టుకుంది. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్​ ట్రైన్ల కోసం స్పెషల్​ ట్రాక్​లను నిర్మించనుంది. ప్రస్తుతం ఉన్న ట్రాక్​లు కేవలం 80 నుంచి 160 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకుంటాయి. అయితే, బెంగళూరుకు ఏ రూట్​లో ట్రాక్​ వేస్తారన్న దానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం సికింద్రాబాద్​ నుంచి గుంటూరు, నడికుడి మీదుగా, కాచిగూడ నుంచి మహబూబ్​నగర్​ రూట్​లో, వికారాబాద్​ నుంచి వాడీ మీదుగా బెంగళూరు వెళ్లేందుకు మూడు రూట్లు ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్​– ముంబై మధ్య 709 కిలోమీటర్ల మేర రూ.లక్షా 41 వేల 800 కోట్లతో బుల్లెట్​ ట్రైన్​ కారిడార్​ను రైల్వే శాఖ ప్రతిపాదించింది. డీపీఆర్​ల కోసం అధికారులు కసరత్తులు చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది పనులు మొదలయ్యే చాన్స్ ఉంది.