చంద్రబాబు అరెస్ట్.. మరోసారి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం

చంద్రబాబు అరెస్ట్.. మరోసారి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం

 స్కిల్ డెవ్ లప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే  చంద్రబాబు సెంట్రల్ జైలుకెళ్లడంతో  థ్యాంక్యూ జగన్ అంటూ ఏపీలో పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పేరుతో జగ్గయ్యపేటలో  వేసిన  ఈ ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ ఫోటోతో పాటు.. నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ జగన్ కు బొకే ఇచ్చి కంగ్రాట్స్ చెబుతున్నట్లు ఫ్లెక్సీ వేశారు.

ఇంతకీ ఆ ఫ్లెక్సీలో ఏముందంటే.? థ్యాంక్యూ జగన్..నా ఆత్మకు శాంతి చేకూర్చావు. నన్ను చివరి దశలో అనేక అనుమానాలకు ,అత్యంత క్షోభకు గురిచేసి నా మరణానికి కారణమైన నీచుడు చంద్రబాబు. నేను చనిపోయాక నా మరణాన్ని వాడుకుని నా కుమారుడు హరికృష్ణ మరణాన్ని కూడా వీడి కుటిల రాజకీయాలకు వాడుకుని.. చివరకు నా మనవడు తారకరత్న మరణాన్ని కూడా వీడి కొడుకు నీచ రాజకీయానికి వాడుకున్న  నీచుడికి బుద్ధి చెప్పి.. నా ఆత్మకు శాంతిని చేకూర్చావు. నీచుడు దుర్మార్గుడైన చంద్రబాబు సెప్టెంబర్ 10న జైలుకు వెళ్తున్న సందర్భంగా  తెలుగు ప్రజలందరూ కూడా ఈ రోజును ఆత్మశాంతి దినోత్సవంగా జరుపుకోవాలని నా మనవి..ఇట్లు సీనియర్ ఎన్టీఆర్ అని ఫ్లెక్సీలో వేయడం కలకలం రేపుతోంది. 

అయితే ఈ ఫ్లెక్సీలను ఎవరైనా జూనియర్ ఎన్టీఆర్అభిమానులు పెట్టారా? లేకుంటే వైసీపీ నేతలు పెట్టారా అనేదానిపై  క్లారిటీ లేదు.  దీనిపైన జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘాల నుంచి కూడా ఎటువంటి ప్రకటన రాలేదు. అయతే టీడీపీ నేతలు మాత్రం పోస్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలే కావాలని ఎన్టీఆర్ పేరుతో ఫ్లెక్సీలు వేశారంటూ ఆరోపిస్తున్నారు.