జూబ్లీహిల్స్ , వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా సిరిసిల్ల, సిద్దిపేట ప్రాంతాల నుంచి వచ్చిన బీఆర్ఎస్ లీడర్లు.. ఇక్కడి ఓటర్లకు డబ్బులు పంచి ప్రలోభ పెట్టారని, అయినా అంతిమ విజయం కాంగ్రెస్దే అని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆరోపించారు. ఇతర జిల్లాల నుంచి వందల సంఖ్యలో బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు నియోజకవర్గంలో ప్రవేశించి తిష్ట వేశారన్నారు. నోట్లు కట్టలు వెదజల్లి ఓటర్లను కొనే ప్రయత్నం చేశారన్నారు. అయితే, ఓటర్లు మాత్రం వారు మెచ్చిన, నచ్చిన నవీన్యాదవ్కే ఓట్లు వేశారన్నారు. నిబంధనలను తుంగలో తొక్కి ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. మరోవైపు అక్కడక్కడా బీఆర్ఎస్ కార్యకర్తలపై దౌర్జన్యాలు జరిగాయన్నారు.
