భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ భద్రాద్రికొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ సోమవారం తీర్పు ఇచ్చారు. పాల్వంచ మండలం రేపల్లవాడలోని ఎస్సీ కాలనీకి చెందిన బింగి వెంకటేశ్వర్లు, శ్రీనుతో 2016, జూన్13న అదే గ్రామానికి చెందిన బింగి కోటేశ్, సావిత్రి, భద్రం గొడవ పడి కర్రలతో దాడిచేశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన శ్రీనును స్థానికులు పాల్వంచ హాస్పిటల్కు తరలించారు.
పరిస్థితి విషమించడంతో కొత్తగూడెం జిల్లా హాస్పిటల్కు తీసుకెళ్తుండగా, దారిలోనే చనిపోయాడు. శ్రీను భార్య పార్వతి ఫిర్యాదుతో వెంకటేశ్, కోటేశ్ తోపాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి సాక్ష్యాలను పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్చేయగా, సోమవారం విచారణ చేపట్టిన జడ్జి పాటిల్వసంత్ బింగి వెంకటేశ్వర్లు, బింగి కోటేశ్ కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఒక్కొక్కరికి రూ.వెయ్యి ఫైన్ వేశారు.